Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాలీవుడ్ కీ ఎంట్రీ ఇవ్వబోతున్న సాయి పల్లవి.

అందం, అభినయం. డ్యాన్స్.. జోనర్ ఏదైనా ఆ పాత్రలో జీవించేసే అనే నటనతో సాయి పల్లవి తనకిచ్చిన పాత్రలో పూర్తిగా మునిగిపోయి అసలు ఇది సినిమానా లేక నిజమా అనేలా నటిస్తుంది సాయిపల్లవి.

సిల్వర్ స్క్రీన్పై అచ్చ తెలుగు అమ్మాయిలా మెరిసిపోతూ ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఫిదా అలరించింది. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్న సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన గతంలో చాలా వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి.. అవన్నీ వట్టి పుకార్లుగానే మిగిలిపో గా. ఇప్పుడు మళ్లీ – బీజాన్ డెబ్యూ వార్త  వచ్చింది.

ఈ భామ బాలీవుడ్ తెరంగేట్రానికి అంతా సిద్ధమైనట్టు న్యూస్ హల్ చల్ చేస్తోంది. కథనాల ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు ఓ ప్రేమకథా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని విషయం అందరికీ తెలిసిందే. యశ్రీరాజ్ ఫిలింస్ బ్యానర్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు..

ఈ సినిమాకి డైరెక్టర సునీల్ పాండే దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఫీమేల్ లీడ్ రోల్లో కోసం సాయి పల్లవిని సంప్రదించక కథ విని ఓకే చెప్పినట్లు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది… ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిందీ ప్రేక్షకులకు సాయి పల్లవి తనదైన నటనతో తనదైన గ్లామర్ లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించి తన నటనతో అందరిని కట్టిపడేసింది…

సాయిపల్లవి ప్రస్తుతం శివ కార్తికేయన్తో కలిసి ఎస్కే 21లో నటిస్తోంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.. సాయి పల్లవి ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు చేసి సాయి పల్లవి కంటే ఒక ప్రత్యేక గుర్తింపు నేచురల్ బ్యూటీగా తన నటనతో తన అందంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి మెప్పించి తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది..