Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్‌లో 30 మందికి బెర్త్‌ ఖాయం

కాంగ్రెస్‌లో 30 మందికి బెర్త్‌ ఖాయం

– ఉత్తమ్, రేవంత్ ల మధ్య వాగ్వాదంతో మరోసారి కాంగ్రెస్ లో లుకలుకలు

– హుజూర్ నగర్ ఉత్తమ్ కు, కోదాడ పద్మావతిలకు కన్ఫామ్.

– మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారు అంటున్న రేణుక

– బీసీల లెక్క తేల్చాలంటున్న విహెచ్.

– 119 నియోజకవర్గాల గాను 700 మంది దరఖా స్తు

– రేసుగుర్రాల ఎంపికకు మూడంచెల వ్యూహం!

హైదరాబాద్, ఆగస్టు 30 నిజం చెపుతాం:

119 నిమోజకవర్గాలకు 700మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎవరికి టికెట్‌ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వొద్దు..? ఇది పీసీసీకి పెద్ద సవాలే.

ఈ నేపథ్యంలో త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. మంగళవారం గాంధీభవన్ లో ఎన్నికల కమిటీ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశం హాట్ హాట్ గా జరిగింది.

ఉత్తమ్‌ కుమార్ రెడ్డి – రేవంత్‌ రెడ్డి ల మధ్య వివాదం మాత్రమే కాదు.. మరికొందరు నేతలు కూడా తమ వాదనను గట్టిగానే వినిపించారు.

మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారంటూ రేణుకా చౌదరి ప్రశ్నించారు. బీసీల లెక్క తేల్చాలన్నారు వీహెచ్. మరోవైపు.. ఏ ప్రాతిపదికన సర్వేలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి బలరాం నాయక్.

119 నియోజకవర్గాల టికెట్ల కోసం 700 మంది అప్లై చేసుకోవడం తో ఎవర్ని ఎంపిక చేయాలో, ఎవర్ని తీసేయాలో తెలియడం లేదు.

ముందు సింగిల్‌ అప్లికేషన్లు వచ్చిన టికెట్లను తొలి దశలో ప్రకటిస్తారు. తర్వాత కొన్ని అప్లికేషన్లు వచ్చిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల లిస్టును ఢిల్లీ ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి పంపి.. అక్కడి నుంచి ఫైనల్‌ లిస్టు తెప్పించుకుంటారు.

కొన్ని నియోజకవర్గాల్లో పదికన్నా ఎక్కువమంది అప్లై చేసుకున్నారు. ఇక్కడ అభ్యర్థులను లాస్ట్‌ మినిట్‌లో ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.

తొలి దశలో ఇప్పటికే 30 సీట్లు ఖరారు…. 

వారిలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోదాడ – ఉత్తమ్‌ పద్మావతి, మధిర – భట్టి విక్రమార్క, మంథని – శ్రీధర్ బాబు, జగిత్యాల – జీవన్ రెడ్డి, ములుగు – సీతక్క, భద్రాచలం – పొదెం వీరయ్య ,

సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలంపూర్ – సంపత్ కుమార్, నాగార్జునసాగర్ లో జానారెడ్డి కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డి..

కామారెడ్డి – షబ్బీర్ అలీ, మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు, ఆందోల్ – దామోదర రాజనర్సింహ, పరిగి – రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీం పట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి,

ఆలేరు – బీర్ల ఐలయ్య, బాల్కొండ – సునీల్ రెడ్డి, కొత్తగూడెం- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట – దొంతి మాధవ రెడ్డి, పెద్దపల్లి- విజయ రమణరావు,

చొప్పదండి- మేడిపల్లి సత్యం, నిర్మల్ – శ్రీహరి రావు, భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రెడ్డి, బెల్లంపల్లి- గడ్డం వినోద్, నాంపల్లి – ఫిరోజ్ ఖాన్, వేములవాడ- అది శ్రీనివాస్ ఉన్నారు.

ఈ ముప్పై కన్ఫామ్‌ అయితే.. మిగిలిన 80 సీట్లలో ఐదుకన్నా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ స్క్రుటినీపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవసరమైతే బీసీల కోసం నల్గొండ సీటు త్యాగం చేస్తాననంటున్నారు ఎంపీ. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ మాట్లాడాలని రేవంత్ ప్రతిపాదించారన్నారు.

మరి ఇక్కడే ఎంతమందికి టికెట్లు దొరుకుతాయి? ఢిల్లీలో ఇంకెంత మందికి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.