Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కళ్ళల్లో కారం కొట్టి వైన్ షాప్ రైడింగ్ సిబ్బందిపై దాడి

కళ్ళల్లో కారం కొట్టి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు దొంగలించన దొంగలు

సంఘటనా స్థలానికి చేరుకున్న డిఎస్పి. ప్రకాష్, సి.ఐ. రామలింగారెడ్డి, ఎస్సై. పరమేష్
నేరేడుచర్ల 26 నిజం చెపుతాం న్యూస్
శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో గుడిగుంట్ల పాలెం దిర్శించర్ల విద్యుత్ సబ్స్టేషన్ మధ్య జానపహాడ్ రోడ్ రహదారిలో దొంగతనానికి పాల్పడిన దొంగలు.

జానపహాడ్ సిండికేట్ వైన్స్ నుంచి పాలక వీడు వైన్ షాప్ నుంచి నగదు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు తెస్తుండగా వైన్ షాప్ రైడింగ్ సిబ్బందిపై దాడి చేసి మూడు లక్షల రూపాయలు నగదు ను రైడింగ్ సిబ్బందిపై కళ్ళల్లో కారం కొట్టి వాళ్లపై దౌర్జన్యం చేసి వాళ్లని తిట్టి బండి ని కింద పడేసి కలలో కారం చల్లి డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగల ముఠా.

రైడింగ్ సిబ్బంది సెల్ఫోన్లను పొలాల్లో విసిరేసి పారిపోయన దొంగలు ముఠా, జానపాడు పాలకీడు వైన్స్ దగ్గర నుంచి నగదు తెస్తుంటే దారి కాచి కళ్ళల్లో కారం కొట్టి దోపిడీ చేసిన దొంగలు.

సంఘటనా స్థలానికి దగ్గరికి కోదాడ డిఎస్పి ప్రకాష్ గారు హుజూర్నగర్ సి ఐ.రామలింగారెడ్డి నేరేడుచర్ల పాలకీడు ఎస్సైలు సంఘటన స్థలాల దగ్గరికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.
పాలకీడు జానపాడు వైన్ షాప్ నుంచి ప్రతిరోజు బెల్ట్ షాపుల దగ్గరికి రైడింగ్ చేస్తున్న వ్యక్తుల కట్టా సుధాకర్ రెడ్డి,
బొలిశెట్టి శ్రీనివాస్ అనే ఇరువురు నేరేడుచర్ల నుంచి పాలకీడు జాన్పాడు వైన్స్ దగ్గరికి వెళ్లి దగ్గర డబ్బు తీసుకొస్తుంటే దారి కాచి దొంగలు దోపిడీ చేశారని మా కళ్ళల్లో కారం కొట్టి మా దగ్గర డబ్బులు తీసుకువెళ్లారని చెపుతున్నారు.

కట్టా సుధాకర్ రెడ్డి నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రకాష్  ఎస్సై పరమేష్ ఆధ్వర్యంలో ఇంటరాగేషన్ చేస్తున్నారు.

బొలిశెట్టి శ్రీనివాస్ పాలకవీడు పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి న సి. ఐ రామలింగారెడ్డి ఇంటరాగేషన్ చేస్తున్నారు.
సంఘటన స్థలం నుంచి సీసీ కెమెరాలు ఫోటోలు చెక్ చేస్తున్న పోలీస్ సిబ్బంది, దారి కాసి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు గతంలో కూడా పలు దొంగతనాలు జరిగాయి