Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అధికార పార్టీ వారికి పేదలేనా టార్గెట్

ఇంజమూరి వెంకటయ్య సూటి ప్రశ్న

నేరేడుచర్ల ఆగస్టు 14 నిజం న్యూస్.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం , నేరేడుచర్ల రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 633 ప్రభుత్వ బంచరాయి భూమి విస్తీర్ణం య. 21 – 17 గుంటల భూమి ఉన్నదనీ

అట్టి దానిలో గతంలో నలుగురు ఎస్సీలకు విస్తీర్ణం య. 1-36గుంటలు లావునీ పట్టాలు మంజూరు చేశామనీ మరియు నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డు నకు , స్మశాన వాటికకు మరియు నర్సరీ కొరకు విస్తీర్ణం య. 3-36 గుంటలు కేటాయించమనీ

మేము పెట్టిన సమాచార హక్కు దరఖాస్తు ననుసరించి నెం. బి/ 2620/2023 ద్వారా తేదీ 12-7-2023న మండల తహశీల్దార్ కార్యాలయం నేరేడుచర్ల గారి ద్వారా సంబంధిత ప్రభుత్వ భూమి యొక్క కార్యాలయ రికార్డు నకల్లు ఇవ్వగా

జిల్లా కలెక్టర్ సూర్యాపేట గారికి దరఖాస్తు ఇవ్వనైదనీ తెలుగుదేశం పార్టీ నల్లగొండ పార్లమెంటు సీనియర్ నాయకులు , నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షుడు ఇంజమూరి వెంకటయ్య విలేకరులతో మాట్లాడుతూ

సర్వే నెంబర్ 633 యందు గల బంచరాయి భూమి య. 21-17 గుంటలు ఉండగా ప్రభుత్వం అఫీషియల్ గా పంపిణీ చేసిన భూమి విస్తీర్ణం య. 5-26 గుంటలు పోగా మిగిలిన భూమి 16-09 గుంటల భూమి ఎవరి కబ్జాలో దురాక్రమణ గలదో సర్వేజరిపి ప్రభుత్వ స్వాదీనం చేసుకొవాలనీ వారు కోరారు.

రెవెన్యూ అధికారులు , మున్సిపల్ అధికారులు పేదలు నివశించేందుకు గుడిసెలు వేసుకుంటే తొలగించడం మరియు ఎవరికీ ఆటంకం లేని ప్లాట్ పట్ఝా ఇవ్వబడి ఒక ఎస్సీ పేద మహిళ ఉండేందుకు రేకులతో చిన్న ఇల్లు వేసుకుని నివశిస్తుంటే పలుమార్లు తొలగించేందుకు వస్తూ

ఆ కుటుంబాన్ని మానసిక వేధింపులకు గురిచేశారే మరి దాదాపు కోట్ల విలువ చేసే ఇట్టి (1 6-09 ) పదహరు ఎకరాల తొమ్మిది గుంటల భూమి పట్ల మీ వైఖరిని తెలపాలని అధికారులకు, అధికార పార్టీ వారికి కేవలం పేదలేనా టార్గెట్ నా అని వారు ఆవేధన వ్యక్తం చేశారు.