Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అంబులెన్స్ లో డెలివరీ….తల్లి బిడ్డలు క్షేమం

108 సిబ్బందిని అభినందించిన జిల్లా మేనేజర్.

ఏటూరునాగారం జూలై 28 నిజం చెపుతాం న్యూస్:

తెల్లవారుజామున ఏడు గంటల సమయంలో భూపాలపల్లి 108 అంబులెన్స్ కి బక్కయ్యపేట గ్రామం నుండి పురిటినొప్పుల కేసు రావడం జరిగింది.

108 స్టాప్ వెళ్లి ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన బయ్యక్కపేట పేట అనే గ్రామం అటవీ ప్రాంతం ఈ వర్షాల కారణంగా రోడ్డు సౌకర్యం సరిగా లేక వెహికల్ వెళ్లనిచో భూపాలపల్లి అంబులెన్స్ స్టాప్ సుమారు ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లి తీసుకురావడం కూడా జరిగింది.

గుత్తి కోయల కి సంబంధించి న తెల్లంఎర్రమ్మ భర్త రాంబాబువయస్సు 29 గర్భవతి తో ఉన్న పేషెంట్ ని అంబులెన్స్ లో ఎక్కించుకొని వస్తుండగా భూపాలపల్లి రాంపూర్ ప్రాంతంలో 9:30 గంటల సమయంలో అంబులెన్స్ లోనే నార్మల్ డెలివరీ జరగడం జరిగింది.

వారికి మగ బిడ్డ పుట్టడం జరిగింది సుమారువేట్ 2.5 కేజీ తల్లి బిడ్డలని 100 పడకల హాస్పిటల్ భూపాలపల్లి లో సురక్షితంగా అడ్మిట్ చేశారు.

ఈ ఘటనలో 108సిబ్బంది ఈఎంటి విజయ్ కుమార్, పైలట్ శరత్, స్థానిక ఆశ వర్కర్,గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులు ఉన్నారు.