మై హోమ్ లో ఘోర ప్రమాదం. ఐదుగురు మృతి ?
సూర్యాపేట ప్రతినిధి జులై 25 నిజం చెపుతాం న్యూస్
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ లో ఘోర ప్రమాదం మంగళవారం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం
అనుమతి లేకుండా నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం. ప్రమాదవశాత్తు జరగగా, 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కిందపడిన కాంట్రాక్ట్ కార్మికులు
ఐదుగురు మృతి చెందినట్లు,, పలువురికి తీవ్ర గాయాల పాలైనట్లు తెలిసింది.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.
క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన వారు.ప్రమాదంపై గోప్యత పాటిస్తున్న మై హోమ్ యాజమాన్యం.
జరిగిన సంఘటన పై విచారణ జరిపి వలస కూలీలకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.