Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెరుచుకోని వార్డ్ సచివాలయం …ఇబ్బందులు పడ్డ ప్రజలు

నిజం న్యూస్. విశాఖపట్నం

వార్డ్ సచివాలయం బుధవారం ఉదయం నుంచి తెరవక పోవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు.

ఓ పక్క గ్రామపంచాయతీ ల్లో సచివాలయాలు చక్కగా పనిచేస్తుండగా, నగరంలో ఉన్న వార్డ్ సచివాలయం తెరవకుండా ఉండడం సమంజసమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

జీవీఎంసీ 23 వ వార్డు సచివాలయం నెంబర్ 1086215 ఉదయం నుంచి తెరవక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.