లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 40 మందికి గాయాలు!!
మహబూబాబాద్ బ్యూరో జూన్ 9 నిజం న్యూస్
విజయవాడ 65వ జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద విజయవాడ వైపు వెళ్తున్న కోదాడ ఆర్టీసీ డిపో బస్సు… రోడ్డు డివైడర్ మీద ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ఘటనతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది………