Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జూన్ 4న‌ నిర్మల్ సీఎం కేసీఆర్ పర్యటన

పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
లక్ష మందితో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
ఎల్ల‌పల్లి శివారు క్ర‌ష‌ర్ రోడ్ లో అనువైన స్థలంలో బహిరంగ సభ నిర్వహణ
నూత‌న స‌మీకృత క‌లెక్ట‌రేట్, బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించ‌నున్న సీయం

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో మే 28
(నిజం న్యూస్)
నిర్మ‌ల్, సమీకృత కలెక్టరేట్, బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు జిల్లాకు వస్తున్న సీఎం కేసీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆదివారం మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి క‌లెక్ట‌ర్ వ‌రుణ్ రెడ్డి, సంబంధిత జిల్లా అధికారుల‌తో క‌లిసి నూతన సమీకృత కలెక్టరేట్‌ సముదాయం, కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని, బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని,హెలిప్యాడ్ ను పరిశీలించారు.

ALSO READ: టాస్క్ ఫోర్స్ వాహనంతో ట్రాఫిక్ నియంత్రణ
ఈ సందర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని అన్నారు.

సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎల్ల‌ప‌ల్లి గ్రామ శివారులోని క్ర‌ష‌ర్ రోడ్ లో అనువైన స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, గత 9 సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని మంత్రి తెలిపారు.

ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేసి ప్ర‌తీ జిల్లా కేంద్రంలో స‌మీకృత క‌లెక్ట‌రేట్ స‌ముదాయ భ‌వ‌నాలను నిర్మించార‌ని చెప్పారు. సీయం కేసీఆర్ స‌భ‌కు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి రావాల‌ని పిలుపునిచ్చారు.
జూన్ 2 వ‌ర‌కు అన్ని ప‌నులు పూర్తి చేయాల‌ని, సభకు వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధుల కోసం అవసరమైన మేర పార్కింగ్ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.