వేద పాండిత్యంలో చీకోడు వాసికి డాక్టరేట్
దుబ్బాక మే 28 నిజం చెబుతాం
వేద పాండిత్యంలో విశేష కృషి చేస్తున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడు గ్రామానికి చెందిన కొండపాక కృష్ణమాచార్యులకు డాక్టరేట్ లభించింది. సినిమా రంగంలో గేయ రచనలు, కథలను సమకూరుస్తూనే వేద పాండిత్యం, రాజకీయ జ్యోతిష్యం, వాస్తు రంగంలో రాష్ట్రంలోనే మంచి గుర్తింపు పొందిన కృష్ణమాచార్యులకు ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసర్చ్ యూనివర్సిటీ ఆద్వర్యంలో ఆదివారం తమిళనాడులోని హోసూర్ క్లరిస్టా హోటల్లో డాక్టరేట్ ను ప్రధానం చేశారు.
ALSO READ: నోటీసులు ఇవ్వకుండా మొండికేసిన తహశీల్దార్
వేద ధార్మిక సేవ సమితికి రాష్ట్ర అధ్యక్షులుగా పని చేస్తూనే పలు సామాజిక సేవ రంగంలో విశేష కృషి చేస్తున్నారు. వేద పాండిత్యంలో డాక్టరేట్ సాధించిన కృష్ణమాచార్యులుకు బ్రహ్మణ సంఘాల వేద పండితులు నరహరి, తిరుమల చార్యులు, లక్ష్మణా చార్యులు, సీహెచ్ కృష్ణమాచార్యులు, శ్రీధర్ అభినందనలు తెలిపారు.
వేద పాండిత్యంలో డాక్టరేట్ సాధించిన కృష్ణమాచార్యులతో చికొడుతో పాటు సిద్దిపేట జిల్లాకు ఆసియా ఖండంలోనే పేరు ప్రఖ్యాతులను సంపాధించి పెట్టడడం గర్వకారణమన్నారు.