Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పోస్ట్ ఆఫీస్ ల్లో 12,828 పోస్టులు

పోస్ట్ ఆఫీస్ ల్లో 12,828 పోస్టులు

మహబూబాబాద్ బ్యూరో మే 28 నిజం న్యూస్

పోస్ట్ ఆఫీసుల్లో 12,828 పోస్టులు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టు మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(బీపీఎం), అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టు మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 12,828 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 96 పోస్టులు ఉన్నాయి.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. వయసు 18 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. జీతం నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380; ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది.

సెలెక్షన్: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మా ర్కుల మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం నియామకాలు చేపడతారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.indiapostgdsonline.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి…