Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆగి ఉన్న బైక్ లో మంటలు

బైక్ నుండి ఒక్కసారిగా చెలరేగిన మంటలు.
పరుగులు తీసిన స్థానికులు.

ఏటూరునాగారం మే 27 నిజం న్యూస్:

ఏటూరునాగారం మండల కేంద్రంలో ద్విచక్ర వాహనం నుండి ఒక్కసారిగా మంటలు  రావడంతో ప్రజలు పరుగులు తీసారు.

వివరాల్లోకి వెళ్తే మండలం కేంద్రంలో వ్యాపార షాపు వద్ద ఓ ద్విచక్ర వాహన దారుడు తన పని నిమిత్తం బైక్ మీద వచ్చి షాప్ ముందు పార్కింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కంగారు పడి బైక్ ను అక్కడే వదిలేసి పరుగులు తీశాడు.

ALSO READ: జోరుగా తునికాకు సేకరణ

గమనించిన స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నం చేసి మంటలను ఆర్పి వేసారు. ఏమైందని విచారించగా బైక్ లో అప్పుడే

పెట్రోల్ ఫుల్ టాంక్ కొట్టించగా,  మంటలు వ్యాప్తి చెందినట్లు తెలిసింది.

అనంతరం బైక్ ను రిపేరు చేయించడానికి తరలించారు.