అనాధ ఆశ్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ మనవరాలు పుట్టినరోజు వేడుకలు
మహబూబాబాద్ బ్యూరో మే 22 నిజం న్యూస్
శిశువిహార్ అనాధ ఆశ్రమంలో రాష్ట్ర గిరిజన స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ మనవరాలు ఆద్య పుట్టిన రోజు వేడుకలు సోమవారం నాడు నిర్వహించారు.
చిన్నారి ఆద్య అనాధ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసారు. అక్కడి చిన్నారులు ఆద్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు. పియానో వాయించి బర్త్ డే విషెస్ చెప్పిన చిన్నారుల ప్రతిభను మంత్రి అభినందించారు.
Also read: బ్లాక్ మనీని వైట్ చేసుకునే యత్నాల్లో బడాబాబులు
చిన్నారులతో కలిసి కొంత సమయం గడిపిన మంత్రి సత్యవతి రాథోడ్ చిన్నారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి నెల పైన కూర్చుని మంత్రి భోజనం చేశారు.
పలువురు చిన్నారులకు మంత్రి గోరుముద్దలు తినిపించారు. అనంతరం శిశువిహార్ ను సందర్శించిన మంత్రి చిన్నారులు అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్యం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.