అక్టోబర్ 12 నుంచి పీజీ పరీక్షలు

కృష్ణా యూనివర్సిటీతో పాటు దాని అనుబంధ కాలేజీల్లో పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 12 నుంచి నిర్వహించనున్నారు. అక్టోబర్ 12-17 వరకు పీజీ పరీక్షలు, అక్టోబర్ 12-19 వరకు MBA, MCA రెండు, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు జరగనున్నాయి.