Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పరీక్ష పేపర్ స్కామ్‌ లో 23కి చేరిన …

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ స్కామ్‌లో ప్రమేయం ఉన్న మరో ఇద్దరిని హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం అరెస్టు చేసింది.

సిట్ అరెస్టు చేసిన వారిలో హైదరాబాద్‌కు చెందిన మురళీధర్ రెడ్డి, వరంగల్‌కు చెందిన మనోజ్ ఒకరు.
“మురళీధర్ మనోజ్‌ని సంప్రదించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పరీక్ష పేపర్‌ను రూ. 10 లక్షలు’  కొన్నాడని  సిట్ అధికారి ఒకరు తెలిపారు.

ALSO READ: విద్యార్థులు సూచనలను ఖచ్చితంగా పాటించాలి

తాజాగా ఇద్దరు వ్యక్తుల అరెస్ట్‌తో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 23కి చేరింది. ప్రధాన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్ పేపర్‌ను మురళీధర్‌కు విక్రయించారు.

మురళీధర్‌, మనోజ్‌లు ప్రశ్నపత్రాన్ని మరికొంత మందికి విక్రయించినట్లు సిట్‌కు తెలిసింది. వీరిని కూడా గుర్తించి పట్టుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.