Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేడే జాబ్ మేళా

నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి!!
మాడ్గుల మే 05( నిజం న్యూస్):
కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయం, రాఘవేంద్ర హిల్స్ లో శనివారం నాడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు.

ALSO READ: అమ్మవారి దివ్య దర్శనం కోసం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 50 కంపెనీలలొ 5000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు.

ఈ ఉద్యోగ మేళాకు మాడ్గుల,అమన్ గల్, కడ్తాల్, వెల్దండ, తలకొండపల్లి,కల్వకుర్తి మండలాల నిరుద్యోగ యువతి,యువకులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  ఆయన తెలిపారు