అఖిల భారత రైతు సంఘం సెప్టెంబర్ 25న భారత్ బంద్ కు పిలుపు
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా అఖిల భారత రైతు సంఘం సెప్టెంబర్ 25న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు ప్రతిపక్షాలతో పాటు, దేశంలోని చిన్న రైతు సంఘాలు కూడా తమ మద్దతు ను ప్రకటించాయి. ఈ వ్యవసాయ బిల్లులను దేశంలోని రైతులందరు వ్యతిరేకిస్తున్నారని అఖిల భారత రైతు సంఘం నాయకుడు సర్ధార్ వీ ఏ సింగ్ అన్నారు. ఈ బిల్లుల ద్వారా కార్పొరేట్ సంస్థలు మాత్రమే లాభపడతాయని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆరోపించారు.