కూతురు న్యూడ్ వీడియో ఇంస్టాగ్రామ్లో పెట్టాడని, బిడ్డ జీవితం నాశనం అయిందని…
ఇందారం హత్య కేసు లో నిందితుల అరెస్ట్
మంచిర్యాల జిల్లా ప్రతినిది ఏప్రిల్ 27 ( నిజం న్యూస్) జైపూర్
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ కార్యాలయం లో జైపూర్ ఎసిపి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇందారం లో జరిగిన హత్య కేసు లో నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించడం జరిగింది.
తేది 25-04-2023 న ఇందారం గ్రామం కి చెందిన ముష్కె మహేష్ మృతుడు తల్లి ముష్కె రాజేశ్వరి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించడం జరిగింది. హత్యా సమాచారం అందగానే జైపూర్ ఎసిపి నరేందర్ ,శ్రీరాంపూర్ సిఐ రాజు జైపూర్ ఎస్సై సంఘటనా స్థలానికి వెళ్లి పరిశిలించి హత్య కి గల కారణాలు తెలుసుకొని, వివరాలు సేకరించడం జరిగింది. జైపూర్ ఎసిపి నరేందర్ పర్యవేక్షణలో నిందితులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక టీం లను ఏర్పాటు చేయడం జరిగింది
దానిలో బాగంగా నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు నిందితులు నేరం చేసిన తరువాత మంథని వైపు వెళ్లి అక్కడ అక్కడ తిరుగుతూ ఈరోజు 27/04/2023 న ఇందారంలోని వారి ఇంటికి వచ్చి వారి యొక్క బట్టలు మరియు డబ్బులు తీసుకొని ఎవరికి కనపడకుండా వెళదామని ఉదయం 05:30 గంటలకు షెట్పెల్లి x రోడ్ వద్ద ఉండగా నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది అని జైపూర్ ఏసిపి వెల్లడించారు.
నిందితుల వివరాలు
1. పెద్దపల్లి కనకయ్య, S/o : ఆశాలు, వయస్సు : 44 సం//లు, కులం : మున్నూరు కాపు, వృత్తి : వ్యవసాయం,ఇందారం గ్రామం.
2. సాయి, వయస్సు : 19 సం//లు కులం : మున్నూరు కాపు, వృత్తి : వ్యవసాయం,ఇందారం గ్రామం.
3. పద్మ, వయస్సు : 40 సం//లు, కులం : మున్నూరు కాపు, వృత్తి : వ్యవసాయం,ఇందారం గ్రామం.
4. శృతి, వయస్సు : 22 సం//లు కులం : మున్నూరు కాపు, వృత్తి : వ్యవసాయం,ఇందారం గ్రామం.
5. శ్వేత, వయస్సు : 21 సం//లు, కులం : మున్నూరు కాపు, వృత్తి : వ్యవసాయం,ఇందారం గ్రామం.
స్వాధీన పరుచుకొన్న వాటి వివరాలు:
ఒక కత్తి,నేరస్తుడు వాడిన సెల్ ఫోన్
వివరాల్లోకి వెళితే ….
పెద్దపల్లి కనకయ్య, S/o : ఆశాలు, వయస్సు : 44 సం//లు, కులం : మున్నూరు కాపు, వృత్తి : వ్యవసాయం, నివాసం : ఇందారం గ్రామం. నా భార్య పేరు పద్మ, వయస్సు : 40 సం//లు, నిందితునికి ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు. పెద్ద కూతురు శృతికి 2019 సంవత్సరములో నజీరుపల్లి కి చెందిన ముష్కె మహేష్ S/o లేట్ రాజమల్లు, అను అతనితో పరిచయం ఏర్పడి వారు ఇద్దరు ప్రేమించుకున్నారు.
2020 సంవత్సరం వరకు వారు ప్రేమలో ఉన్నారు, తర్వాత అతని ప్రవర్తన నచ్చక శృతి అతనిని ప్రేమించడం మానేసి, అతనితో మాట్లాడటం ఆపేసింది. అప్పటినుండి మహేష్, శృతి మరియు అతను ప్రేమించుకున్నపుడు చనువుగా దిగిన ఫోటో ని ఆమెకు చూపించి అట్టి ఫోటోని ఫేస్బుక్ లో ఇంస్టాగ్రామ్లో పెడతానని బెదిరించేవాడు. అట్టి విషయం నిందితుడు కనకయ్య కు తెలిసి మహేష్ ను మందలించినాడు అయినా కూడా అతను తన ప్రవర్తనను మార్చుకోలేదు.
తర్వాత తేదీ 13.06.2022 న మహేష్ శృతి న్యూడ్ వీడియో రికార్డు ను ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్లో అప్లోడ్ చేసినాడు. తర్వాత మహేష్ పై జైపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా Cr.No 92/2022 U/Sec 354(A), 354(C) IPC and Sec 66(E), 67(A) IT ACT కేసు నమోదు అయింది.
ALSO READ: క్వారీ తవ్వకాల్లో నిబంధనలు గాలికి…
సోషల్ మీడియాలో వచ్చిన శృతి యొక్క సోషల్ మీడియా లో వచ్చిన శృతి న్యూడ్ వీడియో లు చూసి అవమానంతో శృతి భర్త తేదీ 28.09.2022 న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇట్టి విషయంలో సీసీసీ నస్పూర్ PS లో Cr.No 259/2022 U/Sec 174 Cr.P.C కేసు నమోదు అయింది.
తర్వాత మహేష్ రోజు మాఇంటి వైపు వస్తు మాఇంటి ముందు నుండి బైక్ పై వెళ్తూ, హారన్ కొడుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టగ తేదీ 09.10.2022 న నిందితుని కొడుకు సాయి ఇంటి ముందు నుండి వెళ్తున్న మహేష్ ను ఆపి అతన్ని కట్టెతో కొట్టగా మహేష్ ఇచ్చిన పిర్యాదు పై పెద్దపల్లి సాయి పై Cr.No 162/2022 U/Sec 341,290,324 IPC జైపూర్ పీస్ లో కేసు నమోదు అయింది.
నిందితుడు కనకయ్య జైపూర్ PS లో తన కూతురు శృతి యొక్క వీడీయో లని సోషల్ మీడియాలో పెట్టినందుకు మహేష్ పై పెట్టిన కేసు విషయంలో మహేష్ తేదీ 17.02.2023 రాత్రి కనకయ్య ఇంటిముందరికి వచ్చి ఇంటిగేటు ని తన్ని పారిపోగా అతనిపై తేదీ 04.03.2023 న జైపూర్ పీస్ లో Cr.No 35/2023 U/Sec 448,290,506 IPC కేసు నమోదు చేయడం జరిగింది.
అతని వల్ల తన కూతురు జీవితం నాశనం అయిందని, కూతురు భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని, ప్రతి రోజు అతను కనకయ్య ఇంటిముందుకు వచ్చి బైక్ హారన్ కొడుతూ మానసికంగా వేధించడం తో ఎలాగైనా మహేష్ ను చంపాలని కనకయ్య , భార్య పద్మ , కూతురు శృతి, కొడుకు సాయి అనుకుని, మహేష్ వారి ఇంటి ముందు నుండి వెళ్ళేటపుడు అడ్డగించి అతన్ని కత్తితో పొడిచి చంపాలని అనుకున్నారు.
అందుకోసం గత పది రోజుల క్రితం నేను గోదావరిఖని వెళ్లి రాజేష్ సినిమా థియేటర్ కు ఎడమ పక్కన గల కత్తులు తయారు చేసే షాప్ లో ఒక కత్తి కొనుక్కొని వచ్చాడు.
ALSO READ: సైకిల్ పై కాశీ యాత్ర చేసిన పల్లెపహాడ్ వాసి
తేదీ 25.04.2023 న ఉదయం అందాజా 08:30 గంటలకు మహేష్ వీరి ఇంటిముందు నుండి ఇందారం బస్సు స్టాండ్ వైపు హారన్ కొట్టుకుంటూ వెళ్ళాడు,
అతను ఎలాగైనా ఇదే దారిలో వస్తాడని వీరు అనుకున్న ప్లాన్ ప్రకారం మహేష్ వచ్చేది గమనించి కనకయ్య కొడుకు సాయి మా ఇంటిముందర బైక్ పై వస్తున్న మహేష్ ని ఆపి కనకయ్య పిలువగా తను వెళ్లి మహేష్ టీ-షర్ట్ పట్టుకుని లాగగా అతను పారిపోయే ప్రయత్నం చేయగా, కనకయ్య భార్య మరియు కూతురు శృతి కొడుకు సాయి అందరూ కలిసి మహేష్ కత్తితో సిమెంట్ ఇటుకతో కొట్టగా బలమైన రక్త గాయాలు అయి మహేష్ అక్కడికి అక్కడే చనిపోయాడు.
వీరు ఇంట్లో ఉంటె మహేష్ తరుపు వారు దాడి చేస్తారని మరియు పోలీసులు పట్టుకుంటారని కనకయ్య ,పద్మ , ఇద్దరు కూతుర్లు శృతి, శ్వేత మరియు కొడుకు సాయి లు అక్కడినుండి పారిపోయారు.
ఈ పత్రిక సమావేశంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు, జైపూర్ ఎస్సై పాల్గొన్నారు.