Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణపై విషం చిమ్మడానికే అమిత్ షా రాక

-కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసింది శూన్యం.

– కాలేశ్వరం పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడానికా…?

– రైల్వే కోచ్,మెడికల్ కాలేజ్ నవోదయ పాఠశాలలు ఇవ్వలేమని చెప్పడానికా..?

– విభజన హామీలు నెరవేర్చలేమని చెప్పడానికా..?

– సోదర భావంతో ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకా?

చేవెళ్ల ఏప్రిల్22(నిజం న్యూస్) :
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి చెవెళ్లలో విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

ఆదివారం చేవెళ్ల లో జరిగే విజయ సంకల్ప భారీ బహిరంగ సభకు వస్తున్న సందర్బంగా…రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ…. తొమ్మిది సంవత్సరాల కాలంలో తెలంగాణకు బిజిపి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని వారు ప్రశ్నించారు. మీరు చెప్పుకోవడానికి ఏముందని
3సంవత్సరాలలో 3వ సారి పర్యటిస్తున్నారన్నారు.

కెసిఆర్ ఒక విజన్ తో పనిచేస్తారని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు,కుంటలు కత్వా కాలువలు పల్లెలన్నీ నిండుకుండలాఉన్నాయన్నారు.పల్లె ప్రగతిని పెంచే ఈ పథకాన్ని దేశమంతట విస్తరింప చేయగలరా..! అని వారిని ప్రశ్నించారు.

కాలేశ్వరం,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించినందుకా.! చేవెళ్ళలో సభ అని వారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రైల్వే కోచ్ మెడికల్ కాలేజ్,నవోదయ స్కూల్స్ ఇవ్వలేమని చెప్పడానికి వస్తున్నారా అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు 84 నవోదయ పాఠశాలలు ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేరని వారు మండిపడ్డారు.

ముఖ్యంగా సాగులో వెనుకబడి ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి బిజెపి ఎం చేసిందని వారి ప్రశ్నించారు. మీకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఐటిఐఆర్ వెనక్కి ఇవ్వగలరా..!అని వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ALSO READ: డాక్టర్ల నిర్లక్ష్యం… తల్లి, బిడ్డ లు …

తెలంగాణ రాష్ట్ర ప్రజలపై బిజెపి వివక్ష చూపిస్తుందన్నారు.వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలం అయితే చిల్లి గవ్వ ఇవ్వలేరన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఇసుమంత కూడా బిజెపి భాగస్వామ్యం లేదన్నారు. రేపు జరిగే సభలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టె మాటలు మాట్లాడకుండా మీరు వెళ్లగలరా.! అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ…. దేశంలో ఉన్న ఏ ఒక్క వర్గానికి కూడా బిజెపి న్యాయం చేయలేదన్నారు. దళితులకు మహిళలకు కార్మికులకు రైతులకు ఏం చేశారని వారి ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి బియ్యం కిసాన్ పేరుతో 2 వెలు రూపాయలు ఇస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 33 జిల్లాలకు నూతన కలెక్టర్ కార్యాలయాలను నిర్మించిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు.కెసి ఆర్ రాష్ట్రంలో ఐదు వేల క్లస్టర్లను ఏర్పాటు చేసి ఏ ఈ ఓ లను పెట్టి 25 లక్షలతో రైతు వేదికలను నిర్మించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ గ్రామపంచాయతీ హోదా తెలంగాణలోని గ్రామాలు పొందుతున్నాయన్నారు.

కాలేశ్వరం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులను జాతీయ హోదా రద్దు చేసినందుకు వస్తున్నారా..? అని వారు ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసిన ఏది ఏమైనా కేసీఆర్ వెంటే ప్రజలు ఉంటారన్నారు. మూడోసారి గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైడ్రిక్ కొట్టనున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.