Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అత్యధిక సిక్స్ లను కొట్టిన భారతీయుడిగా రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చరిత్రలో 250 సిక్సర్ల కొట్టాడు. అత్యధిక సిక్స్ లను కొట్టిన  మొదటి భారతీయుడిగా నిలిచాడు.

‘హిట్‌మ్యాన్’, ముంబైలోని వాంఖడే స్టేడియంలోని శనివారం  పంజాబ్ కింగ్స్ (PBKS)పై ఈ ఘనతను సాధించాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ 27 బంతుల్లో 44 పరుగులు చేశాడు.  అతని ఇన్నింగ్స్ లో  నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్లు ఉన్నాయి.  215 పరుగుల ఛేదనలో లియామ్ లివింగ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్  అయ్యాడు.

ALSO READ: ఒడిశా తీరంలో సముద్ర ఆధారిత ఎండో-అట్మాస్ఫియరిక్ ఇంటర్‌సెప్టర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత నావికాదళం
233 మ్యాచ్‌లలో, అతను 30.29 సగటుతో మరియు 130.22 స్ట్రైక్ రేట్‌తో 6,058 పరుగులు చేశాడు.  లీగ్‌లో 109* అత్యుత్తమ స్కోరుతో ఒక సెంచరీ,  41 అర్ధ సెంచరీలను చేశాడు .
ఐపీఎల్‌లో 250 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన మూడో ఆటగాడు రోహిత్ శర్మ .

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి ఐదుగురు ఆటగాళ్లు: క్రిస్ గేల్ – 357, ఎబి డివిలియర్స్ – 251, రోహిత్ శర్మ – 250, ఎంఎస్ ధోని – 235, విరాట్ కోహ్లీ – 229