Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒడిశా తీరంలో సముద్ర ఆధారిత ఎండో-అట్మాస్ఫియరిక్ ఇంటర్‌సెప్టర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత నావికాదళం

న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఇండియన్ నేవీ శుక్రవారం బంగాళాఖాతంలో ఒడిశా నుండి సముద్ర ఆధారిత ఎండో-అట్మాస్ఫియరిక్ ఇంటర్‌సెప్టర్ క్షిపణి యొక్క తొలి విమాన ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించాయి.

ట్రయల్ యొక్క ఉద్దేశ్యం శత్రు బాలిస్టిక్ క్షిపణి ముప్పును కనిపెట్టి దానిని నాశనం చేయడం ద్వారా భారతదేశాన్ని నౌకాదళ బాలిస్టిక్ క్షిపణి రక్షణ (BMD) సామర్థ్యం కలిగిన దేశాల ఎలైట్ క్లబ్‌ లో ఎదగడమని  రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

DRDO భూ-ఆధారిత BMD వ్యవస్థను ప్రత్యర్థుల నుండి వచ్చే  బాలిస్టిక్ క్షిపణి ముప్పును కనిపెట్టి  నాశనం  చేసే సామర్థ్యాన్ని విజయవంతంగా ఛేదించింది

ALSO READ: గంగకు మనమే శాపం

ట్రయల్‌ విజయవంతంగా కావడం తో దానిలో  పాల్గొన్న DRDO, ఇండియన్ నేవీ కి  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.

క్షిపణి రూపకల్పన, అభివృద్ధిలో పాల్గొన్న బృందాలను DRDO ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ అభినందించారు.

అత్యంత సంక్లిష్టమైన నెట్‌వర్క్-సెంట్రిక్ యాంటీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో దేశం స్వావలంబన సాధించిందని ఆయన అన్నారు.