పేపర్ లీక్ పాపం ముమ్మాటికీ ప్రభుత్వానిదే
ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకే సిట్
సిట్ విచారణతో న్యాయం జరగదని తేలింది
టిపిసిసి చీఫ్ రేవంత్ విమర్శలు
హైదరాబాద్,ఏప్రిల్18(ఆర్ఎన్ఎ): టీఎస్పీఎస్సీ కేసు విచారణ రాష్ట్ర అధికారులు చేపడితే కేసులో నిజానిజాలు నిగ్గు తేలవని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు సిట్ ద్వారా ఏ కేసు కూడా తేలలేదని గుర్తు చేశారు. కేవలం కాలయాపనతో నిజాలు అణిచివేసే కుట్ర జరుగుతోందన్నారు.
మంగళవారం విూడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వంలో పెద్దలను కాపాడుకునేందుకే ప్రభుత్వం సిట్ను ఉపయోగించుకుందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పాపం ముమ్మాటికీ సర్కారు దేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాల్సిందేనని పట్టుబట్టారు.
ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకే సిట్ వేశారన్న ఆయన.. పేపర్ లీక్ లో అసలు నిందితులు తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.
22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్లో ప్రధాని సమాధానం ఇచ్చారని.. అంటే పార్లమెంటు సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసినట్లు ప్రధాని అంగీకరించారన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే రోజులో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ చెబుతున్నారని.. బండి మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: ఇద్దరిని బలి తీసుకున్న బయో డీజిల్ ట్యాంక్
హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామన్నారు… ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారన్నారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో బండికి తెలుసా? అని రేవంత్ ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్, ఒకే రోజు 2 లక్షల ఉద్యోగాలని బండి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాక్షేత్రం నుంచి పార్లమెంట్ వరకు నిరుద్యోగుల కోసం కొట్లాడిరది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ మోదీ ఇంటి దగ్గర చేయాలని హితవుపలికారు.
ఈ నెల 21న నల్గొండలో మాహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న ఖమ్మం జిల్లాలో, 26న ఆదిలాబాద్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడిరచారు. మే 4 లేదా 5న సరూర్నగర్లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహిస్తామన్నారు.
ఎల్బీ నగర్లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి.. సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళతామని అన్నారు. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొంటారని టీపీసీసీచీఫ్ పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదని.. నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటమని స్పష్టం చేశారు.
అన్ని నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలపాల్సిందిగా కోరారు. మే 9 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత కార్యక్రమం ఉంటుందని.. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్ని కార్యక్రమాలకు 50లక్షల విద్యార్థులు ఓ సామాజిక బాధ్యతగా పాల్గొనాలని కోరారు.
అన్ని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు ఈ నిరసన దీక్షలో భాగస్వామ్యం కావాలని చెప్పారు. విూ వంతు సహకారాన్ని అందించాలని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు ఢల్లీిలోని ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రస్తుతమున్న ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం కాదు.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న ఆయన.. ఏటా కోటి ఉద్యాగాలిస్తమన్న ప్రధాని సైతం మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తోందని చెప్పారు.