Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉత్తరప్రదేశ్‌లో తుపాకీ పాలన

హైదరాబాద్‌: యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ, గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు అతిక్‌ అహ్మద్‌, ఆయన సోదరుడు అష్రఫ్‌పై కాల్పుల్లో బీజేపీ ప్రభుత్వ పాత్ర ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు.

ఆదివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని, యూపీకి చెందిన ఏ అధికారి కూడా దర్యాప్తులో పాల్గొనకూడదని స్పష్టం చేశారు.

ALSO READ: చైనా గుండెల్లో వణుకు పుట్టిస్తున్న …ప్రలయ్

ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రభుత్వాన్ని నడపడం లేదని.. తుపాకీ పాలనతో ప్రభుత్వం నడుస్తోందని ఒవైసీ అన్నారు.

ప్రయాగ్‌రాజ్‌లో అతిక్ అహ్మద్, అతని సోదరుడి హత్య “కోల్డ్ బ్లడెడ్” హత్య అని MIM చీఫ్ అన్నారు.  ముగ్గురు దుండగులకు ఆ ఆయుధాలు ఎలా వచ్చాయని, కాల్పుల తర్వాత వారు మతపరమైన నినాదాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు.