కొండగట్టు ఆలయచోరీ లో సిసి పుటే జ్ లోనీ ఫొటోస్ విడుదల చేసిన జిల్లా పోలీసులు

దొంగల కోసం గాలింపు చేపట్టిన 10 పొలీస్ బృందాలు ..
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 2 కిలోల స్వామి మకరతోరణం,అర్థమండపంలోఆంజనేయ స్వామి వారి వెండి మకర తోరణం ఎత్తుకెళ్లారు. ఇది ఐదు కిలోల వరకు ఉంటుంది. 3 కిలోల శఠగోపాలు ఎత్తుకెళ్లారు. మొత్తం 15 కిలోల వరకు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వీటి విలువు సుమారు రూ. 9 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇవాళ ఉదయం సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుంచి దొంగలు పడ్డట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు., డాగ్ స్క్వాడ్తో ఆలయ పరిసర ప్రాంతంలో సోదాలు చేశారు.