Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వరి పంట లో కాండం తొలుచు పురుగు కు తీసుకోవలసిన జాగ్రత్తలు

డి రామారావు నాయక్

పెన్ పహాడ్ మండలం ఫిబ్రవరి 8 నిజం న్యూస్

మండల పరిధిలోని పొట్లపహాడ్ గ్రామంలో బుధవారం
జిల్లా వ్యవసాయ అధికారి డి. రామారావ్ నాయక్ వరి పంట పొలాలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ముఖ్యంగా వరి పంట లో కాండం తొలుచు పురుగు ఆశిస్తున్నది అని తెలిపారు.నివారణ కు కార్టాఫ్ హైడ్రో క్లోరి్ 2 గ్రా లేదా క్లోరంట్రిప్రోలే 0.3 మిల్లీ లీటర్లు నీటి లో కలిపి పిచికారి చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్ , వ్యవసాయ విస్తరణ అధికారి జ్యోస్న,రైతులు రామినేని కృష్ణయ్య ,ఎల్లమ్మ వెంకన్న నారాయణ పీతాంబర రెడ్డి,నారాయణ జగన్ రెడ్డి,గొబ్బి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.