ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో…

రాజపేట:ఫిబ్రవరి 3 ( నిజం న్యూస్) రాజపేట మండలం పాముకుంట గ్రామానికి చెందిన 20 సంవత్సరాల యువతి కాకల్ల మౌనిక తాను ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలు తల్లి చంద్రమ్మ శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈనెల 1వ తేదీన ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోయిన మౌనిక 3వ, తేదీ సోమిరెడ్డి వ్యవసాయ బావి వద్ద గల బావిలో శవమై కనిపించింది. తాను ప్రేమించిన వ్యక్తికి ఇతర అమ్మాయితో నిశ్చితార్థం కావడంతో మనస్థాపానికి గురై తన కూతురు మౌనిక ఆత్మహత్యకు పాల్పడిందని చంద్రమ్మ ఫిర్యాదు చేయగా ఎస్సై శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .