Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్వయంభు శివాలయం ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న ఐక్యత పౌండేషన్ చైర్మన్

మాడ్గుల జనవరి 27( నిజం న్యూస్):
మాడ్గుల మండల కేంద్రంలో వెలసిన శ్రీ స్వయంభు శివాలయం ప్రథమ వార్షికోత్సవానికి శుక్రవారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వేలయేండ్ల చరిత్ర గలిగిన శ్రీ స్వయంభు శివాలయాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు అదేవిధంగా ఇంతటి చరిత్ర కలిగిన దేవాలయాన్ని పునర్మించుకొని ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషకరమని తెలుపుతు ఈ పురాతన దేవాలయ పునర్నిర్మాణంలో తన వంతుగా ఐక్యత ఫౌండేషన్ ద్వారా 10 లక్షల రూపాయలు ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సూదిని పద్మనాభ రెడ్డి మాట్లాడుతు ఈ ఆలయ అభివృద్ధికి మంచి మనసుతో చరిత్ర ఆనవాళ్లను భవిష్యత్ తరాలకు అందించడానికి రాఘవేందర్ రెడ్డి 10 లక్షల రూపాయలు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని, ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సూదిని పద్మనాభ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు గ్రామస్తులు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.