Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన సొసైటీ చైర్మన్ తుపాకుల

ముదిగొండ మండలం జనవరి 12(నిజం న్యూస్):-

ముదిగొండ మండల పరిధిలోని వనంవారి కిస్టాపురం గ్రామంలో ఖమ్మం, మధిర,పాలేరు నియోజకవర్గ స్థాయి (“నవీన్ ప్రీమియర్ లీగ్”) జ్ఞాపకార్ధంగా కబడ్డీ పోటీలను ముదిగొండ మండల సొసైటీ చైర్మన్ తుపాకుల ఎలగొండ స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రథమ బహుమతి 10,016/- (తుపాకుల ఎలగొండస్వామి), ద్వితీయ బహుమతి 7,016/-(దమ్మాలపాటి మార్క్స్), తృతీయ బహుమతి 5,016/- (నీరుకొండ సతీష్ – భారత రాష్ట్ర సమితి గ్రామ అధ్యక్షుడు), చతుర్ధ బహుమతి 3,016/- (గుంపుల వర్ధన్ ఆర్.ఎం .పీ) అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు గురువారం నుంచి శనివారం వరకు జరుగుతాయి అని అన్నారు. అనంతరం సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ పోటీలు దోహదపడతాయని తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చాలా కృషి చేసిందన్నారు..సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదన్నారు.