యాదాద్రి నరసింహుడి దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

యదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో డిసెంబర్ 30(నిజం న్యూస్)
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మొట్టమొదటి సారిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రోజు దర్శించు కొన్నారు.. ఈ సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు జగదీష్ రెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డి,సత్యవతి రాథోడ్,విప్ సునీత, రాష్ట్రపతి తో పాటు యాదాద్రి కి వచ్చిన గవర్నర్ తమిళి సై సౌదర రాజన్,
ఆలయ ఈఓ గీత,ఆలయ అధికారులు,మంగళ వాయిద్యాలతో, పూర్ణకుంభంతో అర్చకులు ప్రత్యేకంగా స్వాగతం పలికినారు..యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునర్నిర్మాణమయ్యాక మొదటిసారిగా వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సంకల్పం, సువర్ణపుష్పార్చన పూజల అనంతరం చతుర్వేద ఆశీర్వచనం అందజేసిన ఆలయ పండితులు. ప్రధాన ఆలయ పరిసరాలను పరిశీలించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తిరిగి కొండమీద నుండి ప్రయణమయ్యారు.