అందోల్ నియోజకవర్గం పుల్కల్ లో ప్రవేశించిన జూడో యాత్ర

ఘనంగా స్వాగతం పలికిన నత్తి దశరత్
*మాజీ డిప్యూటీ సిఎం దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి జిల్లా నవంబర్ 3 (నిజం న్యూస్ )పుల్కల్ మండలంలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడోయాత్ర గురువారం అందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ ప్రవేశించింది. సాయంత్రం అయిదు గంటలకు నియోజకవర్గ పరిధిలోని శివంపేట బ్రిడ్జి వద్దవద్ద ప్రారంభమైన జోడయాత్రకు మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ ఘన స్వాగతం పలికారు.సంగారెడ్డి నుంచి పుల్కల్ మండలంలోని శివంపేటకు చేరుకుంది. అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర పట్టణంలోని సిఎస్ఐ చర్చి వద్దకు చేరుకోగానే చౌటకూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యాత్ర ను విజయవంతంగా నిర్వహించారు.రాహూల్ గాంధీ గారికి మండల అధ్యక్షులు నత్తి దశరథ్ పూలమాల వేసి శాలువతో సన్మానించారు, అక్కడి నుండి ప్రారంభమైన యాత్ర శివంపేట బస్టాండ్ వద్దకు యాత్ర చేరుకున్నరు,ఈ యాత్రలో ఉమ్మడి పుల్కల్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యాత్రలో కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ సింగ్ ,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ,ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి ,కాంగ్రెస్ పక్ష నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ,ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు