Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మునుగోడు నియోజకవర్గంలో ఓటు నమోదుకు నేడే చివరి తేదీ

మర్రిగూడ, అక్టోబర్ 04, (నిజం న్యూస్)

మునుగోడు నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి నేడు చివరి తేదీ అని సంబంధిత అధికారులు తెలిపారు.

2004 జనవరి 01 వ తేదీకంటే ముందు జన్మించిన,18 ఏళ్ళు నిండిన యువతి యువకులు పదవ తరగతి మెమో, స్థానిక చిరునామాతో కలిగిన ఆధార్ కార్డ్/వంట గ్యాస్ బిల్/కరెంట్ బిల్లుతో మీ సేవా, ఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

గత నెల సెప్టెంబర్ 30వ తేదీ వరకు 20,181 మంది కొత్త ఓటరుగా చేరేందుకు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలిసింది.