Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సూది మందు హత్య కేసులో వీడిన మిస్టరీ ?

పోలీసులు అదుపులో సూత్రధారులు.. పాత్రధారులు ?*

అక్రమ సంబంధమే సూది సుపారీ హత్యకు కారణం.. ?

ముదిగొండ సెప్టెంబర్ 20(నిజం న్యూస్)

మండలంలోని వల్లబి గ్రామం వద్ద సూది మందు ఇచ్చి షేక్ జమాల్ ను హత్య చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను అనుమానితులుగా పోలిసులు గుర్తించినట్లు సమాచారం. చింతకాని మండలం నామవరం వద్ద ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీచుకుంటుండగా పరారీ అయినట్లు తెలిసింది. నామవరం కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఘటనలో పాల్గొన్నట్లుగా పోలిసులు అనుమాని స్తున్నారు.
అక్రమ సంబందానికి అడ్డువస్తున్నాడనే కారణంతో హత్య చేసినట్లుగా సమాచారం. నర్సింశెట్టి వెంకటేశ్వర్లు , గోదా మోహన్ రావు వీరిద్దరూ మత్కేపల్లి నామారం గ్రామస్తులు గా గుర్తింపు. వివాహేతర సంబంధం తోనే వీరిరువురు పాల్పడ్డారని, సూది పొడిచిన వాడు వెంకటేశ్వర్లుగా గుర్తించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఖమ్మం రూరల్ ఏసీపీ బసవ రెడ్డి సారధ్యంలో పోలీసులు కేసు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.