మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

మిర్యాలగూడ ఆగష్టు 10.(నిజంన్యూస్): మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో ఒక గుర్తు తెలియని మహిళ చనిపోవడం జరిగింది.
అనారోగ్యంతో హలియాలో బస్ ఎక్కిన ఆ మహళను అంబులెన్స్ లో మిర్యాలగూడ ఏరియా హాస్పటల్ కి తరలించగా చికిత్స పొందుతూ ,ఆరోగ్యం వికటించి మరణించారు.
ఆమె చనిపోయే ముందు తన నివాసం దేవరకొండ పట్టణం అని చెప్పిందని మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు తెలిపారు
కావున ఎవరైనా గుర్తుపట్టినట్లయితే మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి 9014555290 కి తెలియజేయగలరు.