20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత, ముగ్గురిపై కేసు

తుంగతుర్తి ఆగస్టు 9 నిజం న్యూస్
అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా 20 క్వింటాళ్ల బియ్యం బొలెరో వాహనము లో తీసుకెళ్తుండగా సమాచారం మేరకు మంగళవారం పోలీసులు రంగ ప్రవేశం చేసి, తూర్పు గూడెం గ్రామానికి చెందిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు తీసుకొని అధిక ధరకు అమ్ముతున్నట్లు యాదగిరిగుట్ట మండలం లాప్ య నాయక్ తండ కు చెందిన వీ రావత్ బి లా నాయక్ ,భరత్ ,మధు లను విచారణ జరిపి, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డానియల్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ రామకోటి గోపీనాయక్ దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.