వర్షాలకు గోడ కూలి తల్లికూతుర్లు మృతి…

నల్లగొండలో తీవ్ర విషాదం
నల్గొండ, జూలై 08(నిజం న్యూస్ )
నల్లగొండలో శుక్రవారం తెల్లవారుజామున కురుస్తున్న వర్షాలకు గోడ కూలి తల్లికూతుర్లు మృతిచెందారు.
తెల్లవారు జామున నిద్రిస్తున్న సమయంలో కులిన గోడకూలి, కూలిన గోడ మరియు బీరువా నిద్రిస్తున్న వీరిపై పడడంతోఅక్కడికక్కడే మృతిచెందారు. మృతులు నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21)
ఇటీవలే కళ్యాణికి వివాహంఅయ్యింది.
కొన్నేళ్లుగా శ్రీకాకుళం నుంచి వలస వచ్చి రైల్వే కూలీలకు వంట చేస్తూ వీరు జీవనంసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి మృతదేహాలను మార్చురీకి తరలించారు.